మొక్కజొన్నను మనం ఆహారంగామే కాక దానా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకు గాను, పేలాలు, తీపికండే మరియు బేబికార్న గాను ఉపయోగించడం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 14 లక్షల ఎకరాలు, ఉత్పత్తి 16 లక్షల టన్నులు మరియు దిగుబడి ఎకరాకు 12 క్వింటాళ్ళుగా (2015-16) నమొదు చేయబడింది.
మొక్కజొన్నలో కాలపరిమితిని బట్టి దీర్ఘకాలిక (100-120), మధ్యకాలిక (90-100) మరియు స్వల్పకాలిక (>90 రోజులు) రకాలు అందుబాటులో ఉన్నాయి.
రకం | పంట కాలం (రోజులు) | దిగుబడి (క్వి/ఎ) | గుణగణాలు |
ఏక సంకర రకాలు | |||
డి.హెచ్.యం. 111 | 90-95 | 25-30 | ఆకు ఎండు, కాండము కుళ్ళు మరియు కంకి ఎండు తెగుళ్ళను తట్టుకొనును. కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండును. |
డి.హెచ్.యం. 113 | 105-120 | 28-30 | కాండం తొలుచు పరుగు మరియు పూత తరువాత వచ్చే ఎండు తెగుళ్ళను తట్టుకొనును |
డి.హెచ్.యం. 115 | 85-90 | 26-28 | గుండ్రని నారింజ రంగు గింజల రకం. ఆకుమాడు, త్రుప్ప మరియు కాండం కుళ్ళు తెగుళ్ళను తట్టుకొనును. |
డి.హెచ్.యం. 117 | 95-100 | 30-35 | గుండ్రని నారింజ రంగు గింజల రకం. కాండం తొలుచు పురుగును, ఆకు ఎండు తెగుళ్ళను మరియు పూత తరువాత వచ్చే కాండం కుళ్ళు తెగుళ్ళను తట్టుకొనును. కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండును. |
డి.హెచ్.యం. 119 | 95-100 | 30-35 | కాండం తొలుచు పరుగు మరియు ఆకు ఎండు తెగుళ్ళను తట్టుకొనును. |
డి.హెచ్.యం. 121 | 90-95 | 30-35 | ఆకు ఎండు, పొడ మరియు పూత తర్వాత వచ్చు కాండం కుళ్ళు తెగుళ్ళను మరియు కాండం తొలుచు పురుగును తటుకొనును. |
కరీంనగర్ మక్క | 90-95 | 30-32 | ఆకు ఎండు మరియు త్రుప్పు తెగుళ్ళను తటుకొనును. |
కరీంనగర్ మక్క 1 | 95-100 | 30-35 | కాండంకుళ్ళు, పొదతెగులు మరియు ఆకు ఎండు తెగుళ్ళను తట్టుకొనును. |
ఏక సంకర పీలాల రకం | |||
బి.పి.సి.హెచ్ 6 | 90-95 | 14-16 | ఆకు ఎండు, పొద మరియు కాండం కుళ్ళు తెగుళ్ళను కొంత వరకు తట్టుకొనును |
కాంపోజిట్ ప్రత్యేక రకాలు | |||
అఁబర్ పాప్ కార్న్ (పేలాల రకం ) | 90-95 | 10-14 | నాణ్యమైన పేలాలకు ఆనువైనది. |
మాధురి (తీపి రకం) | 75-80 | 60-70 క్వి. పచ్చి కందెలు | 24% చక్కెర |
ప్రియా (తీపి రకం) | 75-80 | 70-75 క్వి. పచ్చి కందెలు | 20-22% చక్కెర |
900 యం. గోల్డ్, 30బి07, ఎన్.కె.30, బయో 9681. ఎన్.కె. 6240, ప్రా 311, యం.సి.హెచ్. 36, ఎస్.యం.హెచ్. 3904 బిస్కో 97 గోల్డ్, పయినీర్ 3522 పయినీర్ 3580.
కోహినూర్, ప్రభల్, బిస్కో 855, జె.కె.యం.హెచ్ 175, బయో 9544, యం.సి.హెచ్. 2, కె.హెచ్. 510, కె.హెచ్. 9541, కె.యం.హెచ్.25కె60, ఎన్.యం.హెచ్. 1242, యన్.యస్.సి.హెచ్. 12, యస్. 6217.
పయినీర్ 3342, కె.హెచ్ 5991, డి.కె.సి. 7074, జె.కె.యం.హెచ్. 1701, యం.యం.హెచ్. 133, బయో 605, సన్ వామన్, పయినీర్ 1864, బిస్కో 2238.
నీరు ఇంకే నల్ల రేగడి నేలలు, ఎర్ర నేలలు మరియు ఒండ్రు కలిగిన ఇసుక నేలలు.
దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేయాలి. దుక్కి బాగా దున్ని, చదును చేసుకొని బోదె నాగలితో 60 సెం.మీ. ఎడమతో బోదెలు, కాలువలు చేసుకోవాలి.
జూన్ నుండి జూలై 15 వరకు విత్తుకోవాలి. స్వల్పకాలిక రకాలను జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. రబీలో అక్టోబరు నుండి నవంబరులోగా విత్తుకోవాలి.
బోదెకు పై నుండి 1/3 వ వంతు ఎత్తులో విత్తు కోవాలి. మొలకెత్తిన పది రోజుల తరువాత ఒత్తుగా మొలచిన చోట ఒక్కొక్క మొక్కను మాత్రమే ఉంచి మిగతావి తీసి వేయాలి.
సాధారణ | విత్తన మోతాదు (కి./ఎ.) | దూరము (సెం.మీ.) | మొక్కల సంఖ్య (ఎకరానికి) |
సాధారణ సంకర రకాలు | 8 | 60 x 20 | 33,333 |
తీపి మొక్కజొన్న | 4 | 60 x 20 | 33,333 |
పేలాల మొక్కజొన్న | 5 | 60 x 20 | 33,333 |
బేబికార్న్ మొక్కజొన్న | 10 | 45 x 20 | 44,444 |
పశుగ్రాస మొక్కజొన్న | 16 | 45 x 10 | 88,888 |
ఎరువుల మోతాదు (కి./ఎ.) | ||||||
వర్ష కాలం | యాసంగి | |||||
నత్రజని | భాస్వరం | పొటాష్ | నత్రజని | భాస్వరం | పొటాష్ | |
సాధారణ సంకర రకాలు | 72-80 | 24 | 20 | 80-96 | 32 | 32 |
తీపి మొక్కజొన్న | 60-72 | 24 | 20 | 72-80 | 24 | 20 |
పేలాల మొక్కజొన్న | 32 | 24 | 20 | 40 | 24 | 20 |
బేబీ కార్న్ మొక్కజొన్న | 48 | 20 | 16 | 60-72 | 24 | 20 |
1/3వ వంతు దుక్కిలో, 1/3 వంతు పైరు మోకాలు ఎత్తు దశలో మరియు 1/3 వంతు పూత దశలో.
భాస్వరంమొత్తం దుక్కిలో.
పొటాష్:1/2వ వంతు దుక్కిలో మరియు 1/2 వ వంతు పూత దశలో.
జింక్:ప్రతి 2-3 పంటలకొకసారి దుక్కిలో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ను వేయాలి.
మొక్కజొన్నలో విత్తిన 40-45 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూసుకోవాలి.సమగ్ర కలుపు నివారణలో భాగంగా సూచించిన రసాయన కలుపు మందులు వాడాలి.
అంతరకృషి :విత్తిన 30-35 రోజులకు పశువులతో దంతి/ గొర్రు లేదా ట్రాక్టరుతో కల్టివేటర్/బ్లేడ్/రిడ్జర్ నడిపి అంతరకృషి చేసి నత్రజని ఎరువులను వేసుకొని బోదె నాగలిని నడిపించడం వలన కలుపు నివారణతో పాటు నత్రజని పైపాటు ఎరువు సద్వినియోగం అయి మొక్కల కుదుళ్ళపై మట్టి చేర్చబడి మొక్కలు పడిపోవు.
అంతర మరియు వరుస క్రమ పంటలు :వర్షాకాలంలో వర్షాధారం క్రింద అంతర పంటలుగా రెండు మొక్కజొన్న సాళ్ళకు ఒక సాలు కంది (2:1) లేదా 6 సాళ్ళ వేరుశనగ/ పెసర/ మినుము/ బొబ్బర్లు/ సోయాచిక్కుడు పంటలకు ఒక సాలు మొక్కజొన్న(6:1) వేసుకోవచ్చు, పసుపు సాగు చేయు ప్రాంతాలలో మొక్కజొన్నను పసుపులో మిశ్రమ పంటగా సాగుచేయడం ఆనవాయితి.
మన రాష్ట్రంలో వరుస క్రమ పంటలుగా ముఖ్యంగా వరి-మొక్కజొన్న మరియు మొక్కజొన్న-వేరుశనగ సాగు చేయడం జరుగుతుంది.
కలుపు మందు | మొతాదు (ఎకరాకు) | దశ | నివారణ | |
విత్తిన వెంటనే | ||||
సాధారణ మొక్కజొన్న | అట్రజిన్ 50%డబ్ల్యూపి లేదా | 800 గ్రా.-1.0 కి. | విత్తిన 24 నుండి 48 గం. లోపు తేమ గల నేలపై పిచికారి చేయాలి | వెడల్పాకు కలుపు |
పెండిమిథాలిన్ 30% ఇసి లేదా | 1.0-1.25 లీ. | వెడల్పాకు మరియు గడ్డి జాతి కలుపు | ||
అలాక్లోర్ 50% ఇసి | 1.0-1.25 లీ | |||
మొక్కజొన్నలో అపరాలు గింజలు అంతర పంటగా వేసినప్పుడు | పెండిమిథాలిన్ 30% ఇసి లేదా | 1.0-1.25 లీ. | ||
అలాక్లోర్ 50% ఇసి | 1.0 లీ. | |||
జీరోటిల్లేజి మొక్కజొన్న | అట్రజిన్ 50% డబ్ల్యూపి+ గ్లైఫోసేట్ 41% ఎస్.ఎల్. (లేదా) పారాక్వాట్ 24% ఎస్.ఎల్ | అట్రజిన్ 1 కి. + గ్లైఫోసేట్ 1.5 లీ. (లేదా) పారాక్వాట్ 1 లీ. | వెడల్పాకు కలుపు మరియు వరి దుబ్బుల ఇగురు | |
మొలిచిన కలుపు పై | ||||
సాధారణ మరియు జీరో జిల్లేడి మొక్కజొన్న | 2,4,-డి. సోడియం సాల్ట్ 80% డబ్ల్యూపి | 500 గ్రా. | పంట 30 రోజుల లోపు | వెడల్పాకు కలుపు |
టెంబోట్రయోన్ 34.4% ఎస్.సి+ అట్రజిన్ 50% డబ్ల్యూపి | టెంబోట్రయోన్ 115 మి.లీ. + అట్రజిన్ 400 గ్రా | పంట 15-18 రోజులు లేదా తుంగ 4 ఆకుల దశ | వెడల్పాకు మరియు గడ్డి జాతి కలుపు | |
హెలో సల్ఫ్యూరాన్ మిథైల్ 75 డబ్లూజి | 36 గ్రా. | పంట 15-20 రోజులు లేదా తుంగ 4 ఆకుల దశ | తుంగ | |
హెలో సల్ఫ్యూరాన్ మిథైల్ 75 డబ్లూజి + అట్రజిన్ 50% డబ్ల్యూపి | హెలో సల్ఫ్యూరాన్ 36 గ్రా. + అట్రజిన్ 400గ్రా. | పంట 15-20 రోజులు లేదా కలుపు 4 ఆకుల దశ | తుంగ మరియు వెడల్పాకు కలుపు | |
ట్రోప్రామిజోన్ 33.6% ఎస్. సి.+ అట్రజిన్ 50% డబ్ల్యూపి | ట్రోప్రామిజోన్ 40 మి.లీ. + అట్రజిన్ 400గ్రా. | పంట 15-18 రోజులు లేదా కలుపు 4 ఆకుల దశ | వెడల్పాకు మరియు గడ్డి జాతి కలుపు |
పోషక ధాతు లోపాలు | ముఖ్య గుర్తింపు లక్షణాలు | అనుకూల/వాతావరణ పరిస్థితులు | లోప సవపణ |
భాస్వరం | మొక్క పెరుగుదల తగ్గి ఆకులు ఎరుపుతో కూడిన నీలి రంగులోకి మారుతాయి. | భాస్వరం లోపించిన నేలలలో లేదా వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు లేదా పొలంలో నీరు నిలిచిన యెడల | దుక్కిలో సిఫారసు మేరకు భాస్వరపు ఎరుపును వేయాలి. డి.ఎ.పి. 2 శాతం ద్రావణాన్ని 4 నుంచి 5 రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారి చేసి లోపాన్ని కొంత నరకు సవరించవచ్చు |
జింక్ | ఆకుల ఈనె మధ్య భాగాలు పాలిపోయిన పసుపు మరియు తెలుపు రంగుగా మారుతాయి | వాతావరణం బాగా చల్లగా ఉన్నపుడు/ మోతాదుకు మించి అధికంగా భాస్వరము పైరుకు అందించిన్నపుడు | దుక్కిలో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేటును 2-3 పంటలకొకసారి వాడాలి. పైరురై జింక్ లోప నివారణకు 2 గ్రా. జింక్ సల్ఫేటు ఒక లీటరు నీటికి కలిపి 4 నుండి 5 రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారి చేయాలి. |
బోరాన్ | క్రొత్తగా వస్తున్న ఆకులు చిన్న చిల్లవిగా ఉండి పూర్తిగా విచ్చుకోకుండా కుదించుకుపోయి గుబురుగా, కురచగా కనిపిస్తాయి. | సేంద్రియ కర్బనము లోపించిన ఇసుక నేలల్లో సున్నం శాతం అధికంగా ఉన్న నేలల్లో మరియు చవుడు నేలల్లో బోరాన్ లోపం అగుపిస్తుంది. | 4 కిలోల బోరాక్స్ ఎకరానికి దుక్కిలో కలియ దున్నాలి. 1 గ్రా. బోరాక్స్ లీటరు నీటికి చొప్పున వారం వ్యవధిలో 2-3సార్లు పిచికారి చేయాలి. |
పొటాషియం | మొక్కల క్రింద ఆకులలో మొదలై ఆకు అంచులు పసుపు మరియు గోధుమ రంగులోకి మారి క్రమంగా ఎండిపోతాయి. | పొటాష్ ఎరుపును సరిగ్గా పైరుకు అందించనపుడు, ఆమ్ల మరియు చవుడు ఎక్కువగా ఉన్న నేలల్లో, పొటాషియం లోపము అగుపిస్తుంది | పైరుకు సిఫారసు మేరకు పొటాష్ ఎరుపును వేయాలి. పొటాషియం నైట్రైట్ 10 గ్రా. లీటరు నీటికి చెప్పున కలిపి 2 నుంచి 3 సార్లు 4 నుంచి 5 రోజుల వ్యవధితో పిచికారి చేయాలి. |
పురుగుల పేరు | ముఖ్య గుర్తింపు లక్షణాలు | అనుకూల వాతావరణ పరిస్థితులు/ఉదృతి సమయం | పురుగుల మందులు | జీవ నియంత్రణ పద్దతులు |
---|---|---|---|---|
కాండం తొలుచు పురుగు | విచ్చిన ఆకులపై రంధాలు వరుస క్రమంలో గమనించవచ్చు. లార్వాలు ఎదిగె అంకురాన్ని తినడం వలన మొవ్వు చనిపోయి గొడ్డు మొక్కగా ఏర్పడును (డెడ్ హార్ట) | 10-20 రోజుల పైరును ఆశిస్తుంది. | మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేక క్లోరాంట్రానిలిప్లోల్ 20 ఎస్.సి 0.3 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. 25-30 రోజుల పైరులో కార్బోప్యూరాన్ 3 జి గుళికలను ఎకరానికి 3 కిలోలు ఆకుల సుడులలో వేయాలి. | ట్రైకోగ్రామా ఖిలోనిన్ కార్డులను ఎకరాకు 4 చొప్పున విడతలుగా 12 మరియు 22 రోజుల పైరు దశలో విడుదల చేయాలి. |
పేనుబంక | తల్లి మరియు పిల్ల పురుగులు ఆకులు మరియు కాండం నుంచి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగుకు మారి ముడుచుకు పోతాయి. మొక్క గిడసబారిపోతుంది. మొక్కలపై తేనె లాంటి జిగురు పదార్దం కనబడుట ప్రధాన లక్షణము. | పొడి వాతావరణంలో దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. 30 రోజులు పైబడిన పైరును ఆశిస్తుంది. | అక్షింతల పురుగులు, సిర్ఫిడ్స్, లేస్ వింగ్స్ వంటివి పెనుబంకను అదుపులో ఉంచుతాయి. అవసరమైతే మోనోక్రోటోఫాస్ 1.6 మి.లి. లేదా డైమిథోయేట్ 2 మి.లీ. లేదా ఎసిఫెట్ 1 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. | |
లద్దె పురుగు | ఆకులపై నుండి పచ్చని పధార్ధాని గీకి తినుట వలన ఆకులు జల్లెడాకులుగా మారి క్రమేసి ఆకులు చీరికలుగా ఏర్పడుతాయి. కండెలను కూడా ఆశించి నష్టపరుస్తాయి. | రబీ కాలంలో 7 నుండి 28 రోజుల పంటను లద్దె పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. | పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు క్వినాల్ ఫాన్ 2 మి.లీ. లేదా మోనోక్రొటోఫాస్ 1.6 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఎదిగిన లార్వాల అదుపునకు వరి తవుడు 5 కిలోలు+ బెల్లం అర కిలో+మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిపైరిఫామ్ 500 మి.లీ. తగినంత నీటిలో కలిపి విషపు ఎరను ఉండలుగా తయారు చేసి సాయంకాలం వేళలో పొలంలో చల్లాలి లేదా థయోడికార్బ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. | పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు 5 శాతం వేప గింజల కషాయాన్ని పిచికారి చేయాలి లేదా ఒక ఎకరాకు 100 (ఎల్.ఇ) ఎన్.పి.వి (స్పోడాప్టెరా) ద్రవణాన్ని పిచికారి చేయాలి. |
పచ్చ పురుగు: పైరు లేత దశలో పచ్చ పురుగు లార్వాలు ఆకులను తింటాయి. మొక్కజొన్న కండె పక్వ దశలో ఉన్నప్పుడు ఈ పురుగు పిచు ద్వారా లోపలికి పోయి గింజలను ఆశిస్తుంది.
నివారణ:
పక్షుల బెడద :పావురాలు, కాకులు మొదలయినవి మొలకేత్తే విత్తనాలు మరియు మొక్కలకు అపారనష్టం కలుగచేస్తాయి. రామచిలుకలు పోలకండే సమయం నుంచి విత్తనం గట్టిపడే వరకు ఎక్కువ నష్టం కలుగచేస్తాయి. వీటి ఉధృతి సూర్యోదయం నుంచి ఉదయం 9-10 గంటల వరకు మరియు సాయంకాలం 4 గంటల నుంచి చీకటి పడే వరకు ఉటుంది.
పాల కండెలను ప్రక్కనున్న ఆకులతో కప్పినట్లుగా కట్టి కండెలపై వాటి నష్టం తగ్గించవచ్చు. శబ్దాలతో, అరుపులతో టపాసులు కాల్చి ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పక్షులను పొలం లోనికి రానివ్వకుండా చూడవలెను.
తెగులు పేరు | ముఖ్య గుర్తింపు లక్షణాలు | అనుకూల వాతావరణ పరిస్థితులు/ఉదృతి సమయం | తెగుళ్ళ మందులు | జీవ రసాయనాలు |
టర్సికమ్ ఆకు ఎండు తెగులు | ఆకులపై పొడవైన, కోలకారపు బూడిద/గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. | అధిక తేమ మరియు మంచు పడినప్పుడు, ఉష్ణోగ్రత 18-27o సె. ఉన్నప్పుడు ఈ తెగులు విత్తిన 40-50 రోజుల పంటలో కనిపిస్తుంది. | మాంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటిలొ కలిపి పిచికారి చేయాలి. | |
మేడిస్ ఆకు ఎండు తెగులు | ఆకులపై చిన్న చిన్న కొలగా ఉండి ఎరుపు/గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. | తేమ మరియు ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు ఈ తెగలు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 40-60 రోజు వయసు గల మొక్కలలో ఈ తెగలు గమనించ వచ్చును. | మాంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటిలొ కలిపి పిచికారి చేయాలి. | |
త్రుప్పు తెగులు | ఆకులపై గుండ్రని లేక పొడవాటి గోధుమ వర్ణపు పోక్కులు కనిపిస్తాయి. | అధిక తేమ గల చల్లని వాతావరణంలో ఈ తెగులు ఉధృతి మరియు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ తెగలు నేలలో జాలు ఏర్పడినప్పుడు ఎక్కువగా గమణించవచ్చును. | మాంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటిలొ కలిపి తెగలు తీవ్రతను బట్టి ఒకటి లేక రెండుసార్లు పిచికారి చేయాలి. | |
పాముపొడ తెగులు | నేలకు దగ్గరగా ఉండే క్రింది ఆకులపై బూడిద, గోధుమ రంగు మచ్చలు ఒకదాని తరువాత ఒకటి ఏర్పడి చూడటానికి పాముపొడ మాదిరిగా కనిపిస్తాయి. | ఉష్ణోగ్రత (30o సె.) మరియు తేమ శాతం 90-100% ఉన్నప్పుడు దీని తీవ్రత అధికంగా ఉంటుంది. 40-50 రోజుల పంటలో ఈ తెగులు గమణించవచ్చును. | ప్రొపికొనజోల్ 1 మి.లీ. లేదా హెక్సాకొనజోల్ 2 మి.లీ. లేదా వాలిడమైసిన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. | |
బూజు తెగులు వెర్రి తల తెగులు | మొక్కల ఆకులలో పసుపు రంగు భాగాలు పట్టీలుగా గమనించవచ్చు. ఆకులు దశసరిగా మరియు నిటారుగా అవుతాయి. తెగులు ఆశించిన ఆకుల అడుగు భాగాలలో బూడిద మాదిరి పదార్థాన్ని గమనించవచ్చు.తెగులు తీవ్రమైతే జల్లుతో సహ మొక్క చివర్లు చిన్న చిన్న ఆకుల గుత్తి మాదిరిగా కూరువతను (ఫిల్లోడి) సంతరించుకుంటాయి. | గాలిలో తేమ శాతం, చలి అధికమైనప్పుడు మరియు ఉష్ణోగ్రత 20-25S సె. ఉన్నప్పుడు విత్తిన 10 రోజుల వ్యవధి నుండి 90 రోజుల వరకు కనిపిస్తుంది. | విత్తనశుద్ధి: మెటలాక్సిల్ 35 శాతం డబ్ల్యూఎస్ 2.4 గ్రా. కిలో విత్తనానికి (స్లర్రీ పద్ధతి ద్వారా) లేదా 7 గ్రా.లు పొడి విత్తనశుద్ధికి. తెగులు సోకిన పంటపై మెటలాక్సిల్ 2 గ్రా. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. | |
మసికుళ్ళు | కాండంపై మొదటి కణుపు నుండి గోధుమ రంగు చారలు ఏర్పడిన కాండాన్ని చీల్చినప్పుడు బెండు భాగం కుళ్ళి నలుపు రంగుగా మారును. మొక్కలు క్రింది భాగం నుండి పైకి ఎండిపోతాయి. | వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుట వలన మరియు బెట్ట పరిస్తితులు పూత సమయంలో ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది | 2 కిలోల ట్రైకోడర్మా శీలింధ్రాన్ని 100 కిలోల పశువుల ఎరువుతో వృద్ధి చేసి వరుసగా 3-4 సం.లు భూమిలో కలపాలి. | |
వడలు తెగులు | మొక్కలు పై నుండి క్రిందికి వడలి ఆకులు లేత ఆకుపచ్చ రంగుకు మారి తరువాత ఎండిపోతాయి. కాండాన్ని చీల్చి చూసినప్పుడు ఎరుపు/గోధుమ రంగుకు మారిన బెండును గమణించవచ్చు. | వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుట వలన మరియు బెట్ట పరిస్తితులు పూత సమయంలో ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది |
మొక్కజొన్న సంవత్సరం పొడవునా ఒకే నేలలో పండించినప్పుడు రకరకాల తెగుళ్ళు ఆశించి ఎక్కువగా నష్టపరుస్తాయి. కావున పంటమార్పిడి పాటించాలి. తెగుళ్ళ తీవ్రత నేల స్వభావం, పండించే రకం మరియు వాతావరణ పరిస్ధితుల మీద ఆధారపడి ఉంటుంది.
ఆకు ఎండు తెగుళ్ళు: మొక్కజొన్న ఆశించే తెగుళ్ళలో ముఖ్యమైనవి ఆకు ఎండు తెగుళ్ళు. ఇవి రెండు రకాలు. మొదటి రకం తెగులులో ఆకుల పై మచ్చలు కోలగా ఉండి, నీటితో తడిచినట్లుగా కనిపిస్తాయి. క్రమంగా ఈ మచ్చల పరిమాణం పెరిగి, ఆకాంత వ్యాపించి, ఈకులు పూర్తిగా ఎండిపోతాయి. రెండవ రకం ఆకు ఎండు తెగులులో ఆకుల పై చిన్న చిన్న కోలగా ఉండే బూడిద లేక గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తరువాత ఈ మచ్చల పరిమాణం పెరిగి దిర్ఘచతురస్రాకారంగా మారుతాయి. వాతావరణంలో తేమ మరియు ఉష్ణోగ్రత అదికంగా ఉన్నప్పుడు ఈ తెగులు తీవ్రత ఎక్కువగా ఉటుంది.
నివారణ:
బూజు తెగులు : మొక్కజొన్న పంటను బూజు తెగులు ఆశించినట్లైతే ఆకులు వంకర తిరిగి, ముడతలు పడటం వంటి లక్షణాలు గమనించవచ్చు. ఇటువంటి మొక్కలలో పోలకలు ఎక్కువగా ఏర్పడి మొక్కలు గిడసబారిపోతాయి. ఆకుల పై పసుపు పచ్చని పట్టిలు ఏర్పడడమె కాకుండా పొడవునా చీలిపోతాయి. కొన్ని సార్లు తెగులు తీవ్రత వలన ఆకుల అడుగు భాగాన శిలింధ్రం యొక్క పెరుగుదలను కూడా గంననించవచ్చు. పూత దశ కంటే ముందు తెగులు ఆశించినట్లైతే మొక్కలు పూర్తిగా చనిపోతాయి. అధిక తేమ మరియు వాతావరణ ఉష్ణోగ్రత 20-25౦ సెంటిగ్రేడు ఉన్నప్పుడు తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది.
నివారణ:
త్రుప్పు తెగులు: ఈ తెగులు మొక్క అన్ని భాగాల పై ఆశిస్తుంది. ఆకులపై గుండ్రని లేక పొడవాటి గోధుమ వర్ణపు పొక్కులు కనిపిస్తాయి. పంట పెరిగిన కొలది ఈ పొక్కులు గోధుమ రంగు నుండి నలుపు వర్ణానికి మారుతాయి. అస్ధిక తేమ గల చల్లని వాతావరణంలో త్రుప్పు ఉధృతి మరియు వ్యఫ్తి ఎక్కువగా ఉటుంది.
నివారణ:
కాండం కుళ్ళు తెగుళ్ళు : మొక్కజొన్న ఈ తెగుళ్ళు పూత దశ నుండి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాండం పై గోధుమ రంగు చారలు ఏర్పడి పంట కోతకు రాక ముందే కాండం భాగం విరిగి నేల పై పడిపోతుంది. ఇటువంటి మొక్కలను చీల్చి చూసినప్పుడు లోపల బెండు భాగం కుళ్ళి నలుపు రంగుకు మారుతుంది. పూత దశ నుంచి నేలలో తేమ తగ్గగుండా నీటి తడులు ఇవ్వాలి.
నివారణ:
పాముపోడ తెగులు: నేలకు దగ్గరగా ఉండే క్రింది ఆకుల పై బూడిద మరియు గోధుమ రంగు మచ్చలు ఒకదాని తరువాత ఒకటి ఏర్పడి చూడటానికి పాముపోడ మాదిరిగా కనిపిస్తాయి. ఇవి ఆకుల నుండి కాండానికి వ్యాపిస్తాయి. ఇలా కాండానికి సోకినప్పుడు కణుపుల వద్ద విరిగి మొక్క నేల పై పడిపోతుంది.
నివారణ:
చీడ పీడలు ఆశించినప్పుడు ఏ పంటలోనైనా దిగుబడులు గణనీయంగా తగ్గి రైతుకు అపారమైన నష్టం కలుగజేస్తాయి,. కావున సరియైన సమయంలో మొక్కజొన్న లో సమగ్ర సస్యరక్షణ పాటించడం వలన రైతులు అధిక దిగుబడులు పొందవచ్చు.
మొక్కజొన్నకు సుమారు 500-800 మి.మీ. నీరు వివిధ పంటకాలంలో అవసరమవుతుంది. మొక్కజొన్నలో పూతకు ముందు, పూత మరియు గింజ పాలు పోసుకునే దశలు నీటికి బాగా సున్నితం. 30-40 రోజులలోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం. విత్తిన తర్వాత చేనులో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. సాధారణంగా పంట కాలంలో 6-8 నీటి తడులు అవసరం. వితేటప్పుడు, విత్తిన 15 రోజులకు, 30-35 రోజులకు, పూతదశలో, పూత వచ్చిన 15 రోజులకు మరియు గింజ పాలు పోసుకొనే దశలో నీటి తడులను తప్పకుండా ఇవ్వాలి. దీర్ఘకాలిక వంగడాలకు 1-2 తడులు అధికంగా అవసరమౌతాయి. ముఖ్యంగా ఉదయం వేళలో ఆకులు చుట్ట చుట్టుకున్నట్లు కనిపిస్తే నీటి ఆవశ్యకత ఉన్నట్లుగా గమనించి నీటి తడి ఇవ్వాలి. సాధారణంగా బోదెలు, కాలువల పద్ధతిలో తడికట్టినటైతే నీటి ఆదాతో పాటు కలుపు ఉధృతి తక్కువగా ఉంటుంది. సాగు నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పడు లేక జీవ తడులు ఇవాల్సి వస్తే, కాలువ విడిచి కాలువకు నీరు పెట్టినచో ఎక్కువ విస్తీర్ణంలో పంటకు సాగు నీరందించవచ్చును. సూక్ష్మనీటి సాగు పద్దతైన బిందు సేద్యంలో జంట సాళ్ళ పద్ధతిలో కనుక పంటను విత్తుకున్నట్లయితే ఖర్చు తగ్గడమే కాకుండా నీటి ఆదా మరియు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది.
కండెల పైపొరలు ఎండి, మొక్కలపై వేలాడుతూ, గింజలు గట్టిపడి నొక్కులు పడకుండా, తేమ శాతం 28-30% ఉన్నప్పుడు పంట కోత చేపట్టాలి. కండెలను 3-4 రోజులు బాగా ఎండబెట్టాలి (గింజ తేమ 15% వరకు). యంత్రాలతో గింజలను ఒలిచి తేమ 10-12% వరకు ఆరబెట్టి నిలువ చేయాలి. పేలాల రకాలను గింజలలో 30-35% తేమ ఉన్నప్పడే కండెలు కోసి నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే గింజ పగిలి నాణ్యత తగ్గుతుంది. తీపి రకాలను గింజ పాలుపోసుకునే దశలోనే కండెలు కోసుకోవాలి. బేబీకార్న్ కొరకు పీచు వచ్చిన 1 లేదా 2వ రోజున కోసుకోవాలి. ఆలస్యం చేసినట్లయితే బెండులో పీచు శాతం పెరిగి నాణ్యత తగుతుంది. మొక్కజొన్నను పశువుల మేత కొరకు వేసినప్పుడు 50% పూతదశలో పైరును కోయాలి.
పంటకోతకు వచ్చినప్పుడు పక్వదశను గమనించి కండెలను కోయాలి. పక్వ దశను క్రింది విధముగా గుర్తించాలి.
పైన చెప్పిన యాజమాన్య పద్ధతులు పాటించి రబీలో మొక్కజొన్నను సాగు దిర్ఘకాలిక రకాలు ఎంచుకున్నచో ఎకరానికి 30-40 క్వింటాళ్ళ లేదా మధ్యకాలిక రకాన్ని ఎంచుకున్నచో 25-30 క్వింటాళ్ళ దిగుబడి సాధించే అవకాశం ఉన్నది.
తెలంగాణలో నవంబరు-డిసెంబరు మాసాలలో వరి కోతల అనంతరం విత్తుకోవాలి. బరువైన మరియు తేమను నిలుపుకొను నేలలలో మాత్రమే ఈ పద్ధతిని పాటించాలి. వరికోసిన తరువాత తేమలేనట్లయితే ఒక తేలికపాటి తడి ఇచ్చి మొక్కజొన్నను విత్తుకోవాలి. తాడును ఉపయోగించి 60x20 సెం.మీ. ఎడమతో విత్తు కోవాలి.
మొక్కజొన్నకు మంచి మార్కెట్టు ధర రావాలంటే కొన్ని నాణ్యతా ప్రమాణాలను (భారతీయ ఆహార సంస్థ) తప్పనిసరిగా పాటించాలి.
తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విత్తన భాండాగారంగా అభివర్ణిస్తారు. దేశంలోని మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో దాదాపు 25% (25,000 ఎకరాలు) తెలంగాణలో చేపడుతున్నారు. మన రాష్ట్రంలో రబీలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్ మరియు నిజామాబాద్ జిల్లాలలో ఎక్కువగా విత్తనోత్పత్తి చేపడుతున్నారు. రైతులు వెుక్కజొన్న విత్తనోత్పత్తి ద్వారా వ్యాపార సరళి మొక్కజొన్న సాగుకన్న అధిక లాభాలను పొందవచ్చు.
అక్టోబరు 15 నుండి నవంబర్ 15
వాతావరణం :మొలకెత్తుట :>130 సెం.గ్రే
పంట పెరుగుదల :210-320 సెం.గ్రే
పూత దశ :< 380/400 సెం.గ్రే
ఎకరానికి 10 కిలోలు (మగ+ఆడ). ఆడ మరియు మగ విత్తనాల మోతాదు వాటి వరుసల నిష్పత్తి పై ఆధారపడును.
వీటి యాజమాన్యం దాదాపు వ్యాపార పంటలో మాదిరిగానే ఉండును. పంట అన్ని దశలలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. మొదటి తడి ఆడ, మగ సాళ్ళలోని విత్తనాలు కలిసిపోకుండా ఇవ్వవలెను. గింజ తయారగు దశలో (పంట 70 రోజులు) ఎకరాకు 20 కిలోల నత్రజనిని అదనంగా వేయాలి. అంతర దూరం/సమయము : రెండు క్షేత్రముల మధ్య దూరము, హైబ్రిడ్ రకము (ఏక, ద్వి మరియు త్రి సంకర) మరియు దశను బట్టి 200-600 మీ. వరకు ఉండాలి లేదా 3-5 వారాల అంతర సమయం పాటించాలి.
ఆడ మరియు మగ రకాల నిష్పత్తి హైబ్రిడ్ రకం, దశ, మగ రకం పుప్పొడినిచ్చు శక్తిని బట్టి 1:3 లేదా 1:4 (ఏక సంకర) నుండి 1:5 లేదా 1:6 (త్రి, ద్వి సంకర) వరకు ఉండును.
బెరుకులు తీసివేయుటపక్వదశలో ముందుగా మగ వరుసల కోత చేపట్టాలి. తదుపరి ఆడ వరుసల కోతను గింజ 25-30 శాతం దశలో చేపట్టాలి. కండెలను కల్లంలో లేదా ఎండబెటు యంత్రాలతో బాగా ఎండబెట్టి గింజలను ఒలచి తేవు శాతం 8-12 శాతం వరకు ఆరబెటాలి. యంత్రాలలో ప్రాసెసింగ్, గ్రేడింగ్ మరియు విత్తన శుద్ధిచేసి ప్యాకింగ్ చేస్తారు.
12-18 క్వి/ఎ
త్రి సంకర రకాలు:20-25 క్వి/ఎ
ద్వి సంకర రకాలు:25-30 క్వి/ఎ
హైబ్రిడ్ రకం | ఆడ రకం | మగ రకం | విత్తన దిగుబడి | విత్తన ధర | హైబ్రిడ్ లక్షణాలు | పంట దిగుబడి |
ఏక సంకర రకం | ఇన్ బెడ్ | ఇన్ బెడ్ | అత్యల్పం | అధికం | ఒకే రకంగ | అత్యధికం |
త్రి సంకర రకం | ఏక సంకర రకం | ఇన్ బెడ్ | అధికం | మధ్యస్థం | కొద్ది తేడాలుగా | అధికం |
ద్వి సంకర రకం | ఏక సంకర రకం | ఏక సంకర | అత్యధికం | తక్కువ | అధిక తేడాలుగా | మధ్యస్థం నుండి అధికం |
అక్టోబరు 15 నుండి నవంబరు 15 వరకు విత్తుకున్న పంటలో దిగుబడులు అధికంగా పొందుటకు అవకాశముంది. విత్తేటప్పడు 25 కిలోల యూరియా, 70 కిలోల డి.ఎ.పి మరియు 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ఎకరా పొలంలో ఆఖరి దుక్కిలో వేయాలి. చదును చేసిన పొలంలో 60 సెం.మీ. దూరంలో తూర్పు-పడమడ దిశలలో బోదెలు వేసుకుని 20 సెం.మీ. దూరంలో బోదెకు దక్షిణం వైపున పై నుంచి 1/3 వ వంతు ఎతులో విత్తుకోవాలి. ట్రాక్టరు సహాయంతో అంతరకృషి చేయదలచిన రైతులు 75x20 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. విత్తిన 24-48 గంటల్లో నేలలో తేమ ఉండగానే అట్రజిన్ 50% కలుపు మందును తేలిక నేలల్లో 800 గ్రా. లేక బరువు నేలల్లో 1200గ్రా 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసినచో వెడల్పాకు కలుపు నివారించబడుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో రబీ మొక్కజొన్నను సుమారు 1.78 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఎకరానికి సరాసరి 21.6 క్వింటాళ్ళ దిగుబడి సాధిస్తున్నారు. మొక్కజొన్నను రబీలో ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ మరియు మెదక్ జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఖరిఫ్ తో పోలిస్తే రబీలో చీడపిడల ఉధృతి తక్కువగా ఉండి, ఖరీఫ్ తో పోలిస్తే రబీలో చీడపిడల ఉధృతి తక్కువ ఉండి, దిగుబడి ఎక్కువగా ఉండడమే కాకుండా ధాన్యానికి మార్కెట్ ధర నిలకడగా ఉంటుంది. పచ్చి చొప్పకు కూడా మంచి గిరాకి ఉంటుంది. తక్కువ రోజులలో ఎక్కువ దిగుబదినిచ్చే పంటలలో మొక్కజొన్న ముఖ్యమైనది. ఒక ఎకరం వరి పండించడానికి అవసరమైన ముఖ్యమైనది. ఒక ఎకరం వరి పండించడానికి అవసరమైనది. ఒక ఎకరం వరి పండించడానికి అవసరమైన నీటితో 2.5 ఎకరాల మొక్కజొన్నను పండించవచ్చు. ఎకరానికి 30 క్వింటాళ్ళ దిగుబడి సాధించనచొ సుమారు రూ. 42,000/- (రూ. 1400/క్వింటాలు) వరకు ఆదాయం వస్తుంది. ఎకరానికి రూ. 18,000/- నుండి ఆదాయం వస్తుంది. ఎకరానికి రూ. 18,000/- నుండి రూ. 20,000/- సేద్యపు ఖర్చు పోను రూ. 22,000/- వరకు లాభం వచ్చే అవకాశం ఉన్నది.
రబీ మొక్కజొన్నను అక్టోబర్ 15 నుండి నవంబరు 15 లోగా విత్తితే ఎక్కువ దిగుబడులు పొందవచ్చు. విత్తుకోవడం ఆలస్యమయితే దిగుబడి తగ్గుతుంది.
మొక్కజొన్నలో కాలపరిమితిని బట్టి దీర్ఘకాలిక (100-120), మధ్యకాలిక (90-100) మరియు స్వల్పకాలిక (<90 రోజులు) రకాలు అందుబాటులో ఉన్నాయి. మధ్యకాలిక మరియు దీర్ఘ కాలిక రకాలు స్వల్పకాలిక రకాల కంటే అధిక దిగుబడినిస్తాయి. ఉదా| దీర్ఘకాలిక రకాలు : 900 యం. గోల్డ్, బయో 9681. పయినీర్ 3522, వయినిర్ 3580, 30బి07, ఎన్.కె. 30ఎన్.కె. 6240, జె.కె.యం.హెచ్.2492 మరియు బిస్కో 900 గోల్డ్ మధ్యకాలిక రకాలు: డిహెచ్యం 117, డి.హెచ్.యం 121, ఎస్.యం.హెచ్ 1242, బయో 9544, బయో 9637, ఎన్.యస్.సి.హెచ్ 12, కె.యం.హెచ్ 25, కె. 60 బిస్కో 855 మరియు యస్. 6217 స్వల్పకాలిక రకాలు: డి.హెచ్.యం. 115, పాయినీర్ 3342, సన్వామన్, బిస్కో 22:38, మొక్కజొన్న పరిశోధన కేంద్రం రకాలైన డి.హెచ్.యం 117 మరియు డి.హెచ్.యం 121 చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడులను ఇస్తాయి.
అనుకూలమైన నేలలు : సారవంతమైన మరియు నీరు ఇంకే నల్ల రేగడి, ఎర్ర నేలలు లేదా ఒండ్రు కలిగిన ఇసుక నేలలు మొక్కజొన్న సాగుకు అనుకూలమైనవి. చౌడు మరియు నీరు ఇంకని భూములు సాగుకు పనికిరావు.
నేల తయారి : విత్తుటకు ముందు మూడు లేదా నాలుగు సార్లు నాగలితో లేదా ట్రాక్టర్తో నడిపే కల్టివేటర్తో నిలువునా మరియు అడ్డంగా రెండుసార్లు తేలికపాటి దుక్కులు చేయాలి. ఆఖరి దుక్మిలో సిఫారసు చేసిన ఎరువులు వేసి కలియదున్నాలి. తరువాత బోదె నాగలితో బోదెలు మరియు కాలువలు చేసుకోవాలి.
విత్తన మోతాదు : ఎకరానికి 8-10 కిలోల విత్తనం వాడాలి. మొక్కజొన్నలో నేల స్వభావం, ఎన్నుకునే రకం మరియు ఋతువును బట్టి ఎకరానికి 26, 666 నుండి 33,333 మొక్కల సాంద్రత ఉండేలా చూడాలి.
విత్తనశుద్ధి : కిలో విత్తనానికి 3.0 గ్రా. మాంకోజెబ్ లేదా ధైరమ్ లేదా కాప్లాన్తో విత్తనశుద్ధి చేసుకున్నట్లయితే తొలిదశలో మొక్కలను ఆశించే తెగుళ్ళ బారి నుండి కాపాడుకోవచ్చును.
విత్తు పద్ధతి : దుక్కి చేసిన నేలలో 60x20 సెం.మీ. ఎడం ఉండునట్లు బోదెలు చేసుకోవాలి. విత్తనాన్ని బోదెకు ఒక వైపున పై నుండి 1/8 వ వంతు ఎత్తులో విత్తినచో నీటి
పారుదలకు సులభంగా ఉండడమేకాక, నీరు ఎక్కువైనప్పడు బయటకు పోవడానికి వీలుంటుంది. విత్తిన పది రోజుల తరువాత కుదురుకు ఒక్క మొక్కను మాత్రమే ఉంచి మిగతా మొక్కలను తీసివేయాలి.
ఎరువుల యాజమాన్యం : రబీలో మొక్కజొన్న పంట ఎరువులను ఎక్కువగా సద్వినియోగం చేసుకుంటుంది. కావున భూసార పరీక్షను అనుసరించి నిర్దేశించిన మోతాదులో ఎరువులు వేసుకోవడం వలన రైతులు ఎరువులపై వేసుకోవడం అనవసర ఖర్చుని తగ్గించుకోవచ్చు. ఎకరానికి 90 క్రిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం మరియు 32 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజని ఎరువును 1/4 వ వంతు విత్తేటప్పడు, 1/4వ వంతు 25-30 రోజుల మధ్య, 1/4 వ వంతు 45-50 రోజుల మధ్య మరియు మిగిలిన 1/4వ వంతు 60-65 రోజుల మధ్య వేయాలి. మొత్తం భాస్వరం ఎరువును వితే సమయంలో వేయాలి. పొటాష్ ఎరువును సగం వితే సమయంలో మరియు మిగతా సగం పూత సమయంలో వేసుకోవాలి. ఎకరానికి 20 కిలోల జింక సల్ఫేట్ మూడు పంటల కొకసారి దుక్కిలో వేయాలి.
కలుపు యాజమాన్యము : విత్తిన తరువాత అట్రజిన్ అనే కలుపు మందును తేలిక నేలలో ఎకరానికి 800 గ్రా. లేక బరువు నేలల్లో 1200 గ్రా, 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 2-3 రోజుల లోపు నేలపై తగినంత తేమ ఉన్నప్పడు పిచికారి చేయడం వలన వెటల్పాటి ఆకులు గల కలుపు మొక్కలను దాదాపు ఒక నెల వరకు మొలవకుండా అదుపు చేయవచ్చు. ఒకవేళ పప్పజాతి పంటలను మొక్కజొన్నతో అంతర పంటలుగా విత్తుకున్నప్పడు రెండింటికి సరిపడే పెండిమిథాలిన్ కలుపు మందును ఎకరానికి 1 లీ. ను 200 లీ, నీటిలో కలిపి పిచికారి చేయాలి.
అంతరకృషి : మొక్కజొన్నలో మొదటి 3 నుంచి 4 వారాల వరకు పెరుగుదల నెమ్మదిగా ఉండటం వలన కలుపును ఏ మాత్రం తట్టుకోలేదు. కనుక 6 వారాల వరకు కలుపు పెరుగుదలను అరికట్టి పంటకు నష్టం కలగకుండా చూడాలి. వరుసలలోని మొక్కల మద్య కూడా కలుపు లేకుండా చూసుకోవాలి. పూత దశ తరువాత మొక్కజొన్న పంటలో ఎటువంటి అంతరకృషి చేయనవసరం లేదు.
విత్తిన 30 నుండి 35 రోజులకు కల్టివేటర్తో అంతర కృషి చేసి కలుపు వెుక్కలను పూర్తిగా నివారించవచ్చును. కల్టివేటర్ నడిపిన తరువాత నజ్రతని ఎరువులను వేసి వెంటనే బోదె నాగలిని నడపడం వలన మొక్కల కుదుళ్ళపై మట్టి చేర్చబడి మొక్కలు పడిపోకుండా ఉంటాయి. అలాగే కలుపు మొక్కల నివారణతో పాటు వేసిన నత్రజని ఎరువును వెుక్కలు బాగా ఉపయోగించుకొని ఏపుగా పెరుగుతాయి. దీని తరువాత అవసరాన్ని బట్టి సాళ్ళలో కలుపు తీయించాలి.
నీటి యాజమాన్యం : మొక్కజొన్నకు రబీలో హెక్షారుకు 400-500 మి.మీ. నీరు అవసరం ఉంటుంది. వితే ముందు నేలలో తేమ సరైన స్థాయిలో ఉండాలి. ఎందుకంటే మొక్కజొన్న విత్తనం నీటిని గ్రహించి దాదాపు రెండింతల బరువు పొందిన తరువాత గాని మొలకెత్తదు. మొక్కజొన్న అధిక నీరు (నీటి ముంపు) లేక బెట్ట (నీటి ఎద్దడి) పరిస్థితులను తట్టుకోలేక పోవడం వలన విపరీతంగా నష్టానికి గురవుతుంది. విత్తిన మొదటి రెండు రోజులు నీటి ముంపునకు చాలా సున్నిత దశ ఈ దశలో పంట నీటి ముంపునకు గురైతే అంకురోత్పత్తి శాతం తగ్గుతుంది. పైరు లేత దశలో (విత్తిన తరువాత 30 రోజుల వరకు) నేలలో నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి ముంపు ఉండే భూముల్లో మొక్కజొన్న లేత పసుపు పచ్చగా మారి, పెరుగుదల తగ్గి పంట అంతా ఒకే ఎతులో ఉండక దిగుబడులు గణనీయంగా తగుతాయి. అందువల్ల నేలలో మురుగునీరు పోయే వసతి ఉండాలి లేదా బోదె సాళ్ళ పద్ధతిలో సాగు చేయాలి.
మొక్కజొన్నకు ఎంత వ్యవధిలో నీరు పెట్టాలి అనేది వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం మరియు సేంద్రియ పదార్థ శాతం, పంట రకం, పంట పెరుగుదల దశ, యాజమాన్య పద్ధతులు మరియు నీరు పెట్టే పద్ధతి పైన ఆధారపడి ఉంటుంది. మొక్కజొన్నలో తేమ సున్నిత దశలు: పంట మోకాలెత్తు దశ, పూత దశ, గింజ పాలు పోసుకునే దశ మరియు గింజ నిండే దశ.
నీరు సమృద్ధిగా ఉండే నల్లరేగడి నేలల్లో 5-6 తడులు మరియు ఎర్ర నేలల్లో 8 తడుల వరకు అవసరం. తక్కువ నీటి వనరులున్న మెట్ట ప్రాంతాలలో బిందు సేద్యం వల్ల నీటిని 35-50 శాతం ఆదా చేసి ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న పంటను పండించవచ్చు. ఈవిధంగా నీటి ఉత్పాదకత సామర్థ్యాన్ని 75-90 శాతం వరకు పెంచి 10-20 శాతం వరకు ఎక్కువ దిగుబడులు పొందవచ్చు.
సస్యరక్షణ : మొక్కజొన్న పైరునాశించే కొన్ని చీడపీడలను సరియైన సమయంలో గుర్తించి, తగిన సస్యరక్షణ చర్యలను చేపట్టినటైతే నాణ్యమైన లాభసాటి పంటను సాధించగలరు. మొక్కజొన్నను ఆశించే పురుగులలో కాండం తొలుచు పరుగులు మరియు రసంపీల్చు పురుగులు ముఖ్యమైనవి.
గులాబి రంగు కాండం తొలుచు పరుగు : ఈ పురుగు ముఖ్యంగా రబీ పంట కాలంలో మొక్కజొన్నను మరింత నష్టపరుస్తుంది. తల్లి పురుగు 2-3 వరుసల్లో ఆకు మొదలు మరియు కాండం మధ్యభాగంలో ముత్యాల వంటి గ్రుడ్లను 7-20 రోజులలో పెడుతుంది. ఒక సముదాయంలో 30-100 గ్రుడ్లు ఉంటాయి. వారం రోజుల్లో గ్రుడు పగిలి గులాబి రంగు శరీరంతో ఎర్రని తల కలిగిన పిల్ల పరుగులు కాండాన్ని తొలచి లోపలికి ప్రవేశించి అంకురాన్ని తింటాయి. ఆకులపైన అగ్గిపుల్ల మందం పొడవాటి చిల్లలను వరుసల్లో గమనించవచ్చు. కాండం లోపల "S ఆకారంలో సొరంగాలు ఏర్పడతాయి. మొవ్వను ఆశించుట వలన మొక్కలు చనిపోతాయి. ఈ పురుగు పూతను మరియు కండెను ఆశించడం వలన దిగుబడి తగ్గిపోతుంది. సుమారు 20-40 శాతం పంట నష్టంవాటిల్లే అవకాశం ఉంది.
పేనుబంక : పేనుబంక ఉధృతి అప్పడప్పుడు ముఖ్యంగా మొక్కజొన్న బెట్టకు గురి అయినప్పడు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పేనుబంక ముదురు నీలి ఆకుపచ్చ రంగులో, అండాకారంలో 2 మి.మీ. పొడవు ఉండి పొడవైన నల్లని కాళ్ళను కలిగి రెక్కలు ఉన్నవి మరియు రెక్కలు లేనివి ఉంటాయి. అనుకూల వాతావరణంలో జీవిత కాలం వారం రోజుల్లో పూర్తవుతుంది. ఇవి ఎక్కువగా 30-60 రోజుల వయసున్న పైరును ఆశిస్తాయి.
తల్లి మరియు పిల్ల పురుగులు ఆశించి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు వాడినట్లే, పసుపు రంగుకు మారి ముడుచుకు పోతాయి. మొక్కజొన్న చిన్న దశలో పేనుబంక ఆశిస్తే ఎదుగుదల ఆగిపోతుంది. ఈ పరుగులు తేనె లాంటి జిగురు పదార్గాన్ని విసర్జించడం వల్ల శిలీంద్రాలు సోకే అవకాశముంది. పేనుబంక తల చుంచులను కూడా పూర్తిగా ఆశిస్తుంది. తేనె వంటి పదార్థం కోసం తిరిగే చీమలను బట్టి ఈ పురుగు ఆశించినట్లు తెలుసుకోవచ్చు. పేనుబంక ద్వారా పంట నష్టమే కాకుండా కొన్ని రకాల వైరస్ తెగుళ్ళు కూడా వ్యాపిస్తాయి.
నివారణ : పేనుబంక నివారణకు డైమిధోయేట్ 2 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రా. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. పేనుబంకను సహజంగా అక్షింతల పురుగులు, సిర్ ఫిడ్లు వంటి పరాన్న భుక్కులు మరియు పరాన్న జీవులు అదుపులో ఉంచుతాయి.
పొగాకు లద్దె పురుగు: పైరు మొలకెత్తినప్పటి నుంచి 7-28 రోజుల వరకు ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఆకులపై నుంచి పచ్చని పదారాన్ని గీకి తినుట వల్ల ఆకులు జల్లెడాకులుగా మారతాయి. క్రమేపి రంధ్రాలు ఏర్పడతాయి. అదేవిధంగా కండెలు ఏర్పడిన తరువాత వాటిని కూడా ఆశించి నాశనం చేస్తాయి.
మొక్కజొన్న పంటను రబీలో నవంబరు 15 లోగు విత్తితే అధిక దిగుబడులు పొందవచ్చు.
హెక్టారుకు 20-25 కిలోల విత్తనం వాడాలి. దుక్కిచేసిన నేలలో 60 సెం.మీ ఎడం ఉండునట్లు బోదెలు చేసుకోవాలి. విత్తనాన్ని బోదేకు ఒకవైపున పైనుండి 1/3 వంతు ఎత్తులో 20 సెం.మీ దూరంలో విత్తాలి.
విత్తిన 24-48 గంటల లోపు అట్రాజిన్ అనే కలుపు మందును తేలిక నేలల్లో ఎకరాకు 800 గ్రా. లేదా బరువు నేలల్లో 1200 గ్రా. 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారి చేయాలి. టే౦బోట్రాయాన్ అనే కలుపు మందును 115 మి.లీ + అట్రజిన్ 400 గ్రా. ఒక ఎకరాకు 200 లీటర్లు నీటిలో కలిపి పంట విత్తిన 15-18 రోజుల మధ్య (కలుపు 2-3 ఆకుల దశలో) పిచికారీ చేసినట్లైతే వివిధ రకాల కలుపు మొక్కలను నియంత్రించవచ్చు.
రబీలో ఎకరాకు 80-96 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం మరియు 32 కిలోల పోటాష్ నిచ్చే ఎరువులను వేసుకోవాలి. విత్తేటప్పుడు 1/4వ వంతు 40 మరియు 1/4వ వంతు 60 రోజులకు వేయాలి.
పైరు మొలకెత్తిన 10-12 రోజుల దశలో కాండం తొలుచు పురుగు నివారణ కొరకు మొనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా క్లోరాంట్రానిలీప్రొల్ 0.3 మి.లీ లేదా ఫ్యూబెండమైడ్ 0.2 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పైరు 25 రోజుల దశలో ఉండి పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న యెడల కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను ఎకరాకు 3 కిలల చొప్పున ఆకు సుడులతో వేసుకోవాలి. 30-40 రోజుల దశలో ఉన్న పైరులో అంతరకృషి జరిపి మొదటి దఫా నత్రజని ఎరువును ఎకరాకు 20-25 కిలోలు వేసి మట్టిని యొక్క మొదళ్ళకు ఎగదోయాలి.
మొక్కజొన్న సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామ ప్రధాన శాత్రవేత్త (మొక్కజొన్న), మొక్కజొన్న పరిశోధన కేంద్రం, వ్యవసాయ పరిశోధన సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్ – 500 030 ఫోన్ నెం. 040- 24018447, 8008123671
ఆధారం: వ్యవసాయ పంచాంగం
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021