మన రాష్ట్రంలో మొక్కజొన్న వరాధారంగాను మరియు సాగునీటి క్రింద ఖరీఫ్, రబీ కాలాల్లో పండించబడుతుంది. మొక్కజొన్న ఆహార పంటగానే గాక, దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరకుగాను, పేలాల పంటగాను, తీపికండె రకంగాను మరియు కాయగూర రకంగాను సాగుచేయబడుతుంది. 2008-09 సంవత్సరము సాగు విస్తీర్ణం 8.56 ల.హె, ఉత్పత్తి 42.20 ల టన్నులు, దిగుబడి హెక్టారుకు 4930 కిలోలు.
మన రాష్ట్రంలో మొక్కజొన్న వరాధారం క్రింద సుమారు5.8 లక్షల హెక్టార్లలో మరియు నీటి పారుదల క్రింద సుమారుగా 3.8 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. వరాధారం క్రింద ముఖ్యముగా మెదక్, మహబూబ్నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అధిక సాగులో ఉన్నది. నీటి పారుదల క్రింద గుంటూరు, పశ్చిమ గోదావరి, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో ఎక్కువ సాగులో ఉన్నది.
మొక్కజొన్నలో కాలపరిమితిని బట్టి దీర్ఘకాలిక(105-120), మధ్యకాలిక(90-100), స్వల్పకాలిక (<90 రోజులు) రకాలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలిక మరియు మధ్యకాలిక రకాలు స్వల్పకాలిక రకాల కంటే అధిక దిగుబడినిస్తాయి.
మొక్కజొన్నను మనము ఆహారంగానే గాక, దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను, పేలాలు, తీపికండె మరియు కాయగూర రకంగాను ఉపయోగించడం జరుగుతున్నది. మన రాష్టంలో మొక్కజొన్న సాగు విస్తారణం 8.00 లక్షల ఎకరాలు ఉత్పత్తి 22.13 లక్షల టన్నులు దిగుబడి ఎకరాకు 25.14 కిలోలుగా (2013-14) నమోదు చేయబడినది. వర్షాధారం క్రింద ఖరిఫ్ లో సుమారు 2.75 లక్షల కేకరాల్లో మరియు నీటి పారుదల క్రింద రబీలో సుమారు 6.05 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రబీలో గుంటూరు పశ్చిమ గోదావరి మరియు కృష్ణ జిల్లాలలో ఎక్కువ విస్తీర్ణం లో సాగు చేయబడుతున్నది.
మొక్కజొన్న కలపరిమితినిబట్టి దీర్ఘకాలిక (100-120) మధ్యకాలిక (90-100) మరియు స్వల్పకాలిక (<90 రోజులు) రకాలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలిక మరియు మధ్యకాలిక రకాలు స్వల్పకాలిక రకాలకంటే అధిక దిగుబడినిస్తాయి.
రకం |
పంటకాలం(రోజుల్లో) |
దిగుబడి(క్వి/ఎ) |
గుణగణాలు |
1 |
2 |
3 |
4 |
ఏక సంకర రకాలు |
|||
డి.హెచ్.యం. – 111 (బి.హెచ్.1576) |
90-95
|
25-30
|
అధిక దిగుబ్దినిచ్చు మధ్యకాలిక రకం. ఇది ఆకు ఎండు, కాండము కుళ్ళు మరియు కంకి ఎండు తెగులును తట్టుకుంటుంది. కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండి మేలైన పశుగ్రాసంగా పని కొస్తుంది. |
డి.హెచ్.యం. – 113 (బి.హెచ్.1620) |
105-120
|
28-30 |
అధిక దిగుబడినిచ్చు దీర్ఘకాలిక రకం. ఖరీఫ్ కు అనువైనది. ఇది కొంతవరకు కాండం తొలుచు పురుగు మరియు పూత తరువాత వచ్చే కాండం కుళ్ళు తెల్గులును తట్టుకుంటుంది. |
డి.హెచ్.యం. – 115 (బి.హెచ్.2187) |
85-90 |
26-28
|
స్వల్పకాలిక హైబ్రిడ్. అకర్షనియమైన నారింజ రంగు, గుండ్రని గింజలు కల్గి, ఆకు ఎండు, త్రుప్పు మరియు కాడం కుళ్ళు తెగులును తట్టుకుంటుంది. |
డి.హెచ్.యం. – 117 (బి.హెచ్.40625) |
95-100
|
30-35
|
అధిక దిగుబ్దినిచ్చు మధ్యకాలిక రకము. ఖరీఫ్ మరియు రబీకి అనువైనది. మంచి యాజమన్య పద్ధతులలో 40 క్వింటాళ్ళ వరకు దిగుబడినిస్తుంది. ఇది కొంతవరకు కాండం తొలుచు పురుగును, ఆకు ఎండు తెగులును మరియు పూత తరువాత వచ్చే కాడం కుళ్ళు తెగుళ్ళను తట్టుకుంటుంది. కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండి మేలైన పశు గ్రసంగా పనికొస్తుంది. |
డి.హెచ్.యం. – 119 (బి.హెచ్.4062) |
90-95
|
30-35
|
కాండం తొలుచు పురుగు మరియు ఆకు ఎండు తెగులును తట్టుకొంటుంది. |
డి.హెచ్.యం. – 121 (బి.హెచ్.41009) |
90-95
|
30-35
|
ఆకు ఎండు, పొడ మరియు పూత తర్వాత వచ్చు కాండం కుళ్ళు తెగుళ్ళను మరియు కాండం తొలుచు పురుగును తట్టుకోనును. |
ఏక సంకర పేలాల రకం |
|||
బి.పి.సె.హెచ్ – 6 |
90-95
|
14-16 |
ఆకు ఎండు, పొడ మరియు కాండం కుళ్ళు తెగుళ్ళను కొంతవరకు తట్టుకోనును. |
కాంపోజిట్ ప్రత్యక రకాలు |
|||
అంబర్ పోప్ కార్న్ |
90-95
|
10-14
|
నాణ్యమైన పేలాలకు అనువైనది. |
మాధురి (తీపి రకం) |
75-80 |
30-32 వేల పచ్చి కండెలు
|
తీపి కండె రకం. 24% చెక్కర కలిగి ఉడికించి తినుటకు ఎనువైనది. ఎకరాకు 6-8 టన్నుల పచ్చి చొప్పును ఇస్తుంది.
|
ప్రియ (తీపి రకం) |
78-85 |
30-32 వేల పచ్చి కండెలు |
తీపి కండె రకం. 20-22% చెక్కర కలిగి పొడవైన కండెలు గల రకం. ఉడికించి తినుటకు అనువైనది. ఎకరాకు 6-8 టన్నుల పచ్చి చొప్పును ఇస్తుంది. |
డి.హెచ్.యం - 1 |
85-90
|
18-20
|
ఆకు మూడు తెగులును సమర్థవంతంగా నిరోధించగలదు. |
డి.హెచ్.యం - 103 |
105-120
|
22-25
|
కమ్మ రోగం, కాండం కుళ్ళు తెగుళ్ళను నిరోధించ గలదు. |
డి.హెచ్.యం - 105 |
105-120
|
25-30
|
ఆకు ఎండు, మొక్కకుళ్ళు తెగుళ్ళను నిరోధించగలదు. స్థిరమైన అధిక దిగుబడినిస్తుంది. |
డి.హెచ్.యం - 107 |
88-95
|
22-25
|
నీటి ఎద్దడిని కొంత వరకు తట్టుకొనును. కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండి మేలైన పశుగ్రాసంగా పనికొస్తుంది. |
డి.హెచ్.యం - 109 |
85-90
|
22-25
|
స్వల్పకాలిక హైబ్రిడ్. ఖరీఫ్కు అనుకూలం. నీటి ఎద్దడిని కొంతవరకు తట్టుకొనును. |
త్రిశూలత |
105-120
|
25-30
|
మొవ్వకుళ్ళు తెగులును తట్టుకుంటుంది. |
సింధటిక్స్/కాంపోజిట్స్ |
|||
అశ్విని/హర/వరుణ్ |
90-100
|
18-20
|
వర్షాధార పరిస్థితులకు అనుకూలం. మేలైన అధిక దిగుబడినిచ్చు రకాలు. ఒకసారి కొన్న విత్తనం 3-4 సం. వరకు వాడుకొనవచ్చును. |
ప్రత్యేక రకాలు |
|||
అంబర్ శక్తి - 1 |
90-95
|
10-14
|
మధ్యకాలిక, అధిక ప్రోటీన్స్(10.7%) గల సంకరజాతి రకం. గింజలు మధ్యస్థ నొక్కులు కల్లి, పసుపుపచ్చని నారింజ రంగులో ఉంటాయి. ఆకుమాడు, కాండం కుళ్ళు తెగుళ్ళను తట్టుకుంటుంది. |
అంబర్ పాప్ కార్న్ |
90-95
|
10-14
|
మంచి పేలాలు చేయుటకు అనువైనది. |
మాధురి (తీపి రకం) |
75-80
|
30-32 వేల పచ్చికండెలు
|
తీపిగల కండె రకం. 24% చక్కెర కలిగి ఉడికించి తినుటకు అనువైనది. ఎకరాకు 6-8 టన్నుల పచ్చిచొప్పను ఇస్తుంది. |
ప్రియ (తీపి రకం) |
78-85
|
30-32 వేల పచ్చి కందెలు
|
తీపి కందె రకం. 20-22% చక్కెర కలిగి పొడవైన కందెలు గల రకం. ఉడికించి తెనుటకు అనువైనది. ఎకరాకు 6-8 టన్నుల పచ్చిచొప్పను ఇస్తుంది. |
శ్చిమ గోదావరి మరియు కృష్ణ జిల్లాలలో ఎక్కువ విస్తీర్ణం లో సాగు చేయబడుతున్నది.
900 యం.గోల్డ్, 30బి07, ఎన్/కె.30, బయో 9681, ఎన్.కె 6240, ప్రొ 311, యం.సి.హెచ్. 36, ఎస్.యం.హెచ్. 3904, జె.కె.యం .హెచ్. 2492.
కోహినూర్, ప్రభల్, బిస్కో 855, జె.కె.యం. హెచ్. 175, బయో 9637, యం.సి.హెచ్. 2, కె.హెచ్. 510, కె.హెచ్. 9541 కె.యం.హెచ్. 25కె60.
పయనీర్ 3342, కె.హెచ్. 5991, డి.కె.సి 7074, జె.కె.యం.హెచ్. 1701, యం.యం.హెచ్. 133.
సారవంతమైన మరియు నీరు ఇంకే నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు మరియు ఒండ్రు కలిగిన ఇసుక నేలలు మొక్కజొన్న సాగుకు అనుకూలమైనవి. చౌడు భూములు మరియు నీరు నిలువ ఉండు భూములు పనికిరావు. ఉదజని సూచిక 6.5 నుండి 7.5 ఉన్న నేలలు అనుకూలం.
విత్తుటకు ముందు మూడు, నాలుగు సార్లు నాగలితో దుక్క దున్నాలి. ఎకరాకు దాదాపుగా 10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. తరువాత బోదె నాగలితో బోదెలు, కాలువలు చేసుకోవాలి.
సాధరణ పరిస్దితులలో వర్షాధారపు పంటను జూన్ 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవాలి. రబీలో అక్టోబరు 15 నుండి నవంబరు 15 లోగా విత్తితే ఎక్కువ దిగుబడులు పొందడానికి అవకాశముంది. కోస్తా జిల్లాల్లో వరి మాగాణి తదు పరి జీరో టిల్లెజ్ పద్ధతిలో డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు.
|
విత్తన మోతాదు (కిలోలు/ఎకరాకు) |
విత్తే దూరము |
|
సాళ్ళ మధ్య |
మొక్కల మధ్య |
||
సంకర రకాలు |
8 |
60 సెం.మీ |
20 సెం.మీ |
తీపి మొక్కజొన్న |
4 |
60 సెం.మీ |
20 సెం.మీ |
పేలాల మొక్కజొన్న |
5 |
60 సెం.మీ |
20 సెం.మీ |
బేబి కార్న్ |
10 |
45 సెం.మీ |
20 సెం.మీ |
పశుగ్రాస మొక్కజొన్న |
16 |
45 సెం.మీ |
10 సెం.మీ |
మొదటి బోదె నాగలితో బోదెలు చేసుకోవాలి. తరువాత బోదేకు పై నుండి 1/3 వంతు ఎత్తులో విత్తినచొ నీటిపారుదల సులభంగా ఉండడమే కాక, వర్శపాతం ఎక్కువైనప్పుడు నీరు బయటకు పోవడానికి కూడా వీలుంటుంది. మొలకెత్తిన పది రోజుల తరువాత ఒత్తుగా మొలచిన చోట ఒక్కొక్క మొక్కకు మాత్రమే ఉంచి అందనంగా ఉన్న మొక్కలు తీసివేయాలి.
కిలో విత్తనానికి 3గ్రా. మంకోజేబ్ లేదా ధైరం లేదా కాప్టాన్ తో విత్తనశుద్ధి చేసుకున్నట్లయితే లేత దశోలో మొక్కలను తెగుళ్ళు బారినుండి కాపాడుకోవచ్చు .
వర్షాధారపు పంటకు 1/3 వంతు నత్రజనిని విత్తే సమయంలోను, 1/3 వంతు 30-35 రోజుల మధ్య, మిగిలిన 1/3వ వంతును 50-55 రోజుల మధ్య వేయాలి. మొత్తం భాస్వరం ఎరువును. విత్తే సమయంలో, సగం పోటాష్ ఎరువును విత్తే సమయం, మిగతా సగం పోటాష్ ఎరువును పూత దశలో వేసుకోవాలి. నీటి పారుదల పంటకు నత్రజనిని విత్తేటప్పుడు 1/4 వంతు, 25-30 రోజుల మధ్య 1/4వ వంతు, మిగిలిన 1/4వ వంతు 60-65 రోజులమధ్య వేయాలి. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ని మూడు పంటల కొకసారి దుక్కిలో వేయాలి. మొక్కలలో జింకు లోపం (ఆకుల ఈనెల మధ్య భాగం పసుపుపచ్చ రంగులోకి మారడం మరియు లేత పైరు తెల్ల మొగ్గగా మారడం) కనిపిస్తే లీటరు నీటికి 2 గ్రా. చొప్పున జింకు సల్ఫేట్ ను కలిపి పైరు పై పిచికారీ చేయాలి. పై పాటు ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాలి.
|
ఎరువుల మోతాదు (కిలోలు/ఎకరాకు) |
|||||
ఖరీఫ్ |
రబీ |
|||||
నత్రజని |
భాస్వరం |
పోటాష్ |
నత్రజని |
భాస్వరం |
పోటాష్ |
|
సాధారణ సంకర రకాలు |
72-80 |
24
|
20 |
80-96 |
32 |
32
|
తీపి మొక్కజొన్న |
60-72
|
24
|
20 |
40
|
24
|
20 |
పేలాల మొక్కజొన్న |
32
|
24
|
20
|
40 |
24
|
20
|
బేబీ కార్న్ |
48
|
20
|
16
|
60-72 |
24
|
20 |
పంట విత్తిన తరువాత రెండు, మూడు రోజులలోపు అట్రజిన్ అనే కలుపు మందును తేలిక నేల లో ఎకరాకు 800 గ్రాములు, బరువు నేలలో అయితే ఎకరాకు 1200 గ్రములను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం వలన వెడల్పాటి మరియు కొన్ని గడ్డిజాతి కలుపు మొక్కలను దాదాపు ఒక నేల వరకు అదుపు చేయవచ్చు. మొక్కజోన్నను పప్పుజాతి పంటలతో అంతరాపంటగా వేసినప్పుడు మాత్రం పెండిమిధాలిన్ ను ఎకరాకు 1.0 లీ 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన రెండు రోజులలో పిచికారీ చేయాలి. విత్తిన నేల రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు గమనిస్తే 2, 4-డి సోడియం సాల్ట్ ఎకరాకు 500 గ్రా. 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
టర్సికమ్ ఆకు ఎండు తెగులు : ఆకులపై పొడవైన, కోలాకారపు బూడిద రంగుతో కూడిన ఆకుపచ్చ లేక గోధుమ వర్ణపు మచ్చలు కన్పిస్తాయి. ఈ మచ్చలు 2.5 నుండి 25 సెం.మీ. పొడవు మరియు 4 సెం.మీ. వెడల్పు ఉంటాయి. ఈ మచ్చలు మొు దట మొక్క క్రింది ఆకులపై అగుపించి, పెద్దవై పై ఆకులకు కూడా వ్యాపిస్తాయి. అధిక తేమతో కూడిన వాతావరణంలో ఆకు అంతా ఎండి మొక్కలు చనిపోయినట్లుగా అగుపిస్తాయి. శిలీంధ్ర బీజాలు ఆకుల అడుగు భాగాన వలయాలుగా అగుపిస్తాయి. ఈ మచ్చలు కండెపై ఉన్న పొట్టుపై కూడా వ్యాపిస్తాయి.
విత్తిన 30-35 రోజులకు పశువలతో (దంతి లేక గొర్రు) లేదా ట్రాక్టరుతో (కల్టివేటరు/బ్లేడ్/రిడ్జర్) అంతరకృషి చేస్తే కలుపు మొక్కలను నివారించవచ్చు. తరువాత నత్రజని ఎరువులను వేసి దాని వెంటనే బోదె నాగలిని నడిపినచో కలుపు మొక్కల నివారణతోపాటు వేసిన ఎరువు పంట పెరుగుదలకు సక్రమంగా వినియోగపడుతుంది. ఈ విధంగా బోదేనాగాలి నడిపినచొ మొక్కల కుదుళ్ళపై మట్టి చేర్చబడి మొక్కలు పడిపోకుండా ఉంటాయి.
పొలంలో ఒకే పంటను వేయడానికి బదులు రెండు పంటలు వేయడం వలన వర్షాభావ పరిస్ధితులు ఎదురైనపుడు కనీసం ఒక పంట నష్టపాయినను ఇంకొక పంట నుండి ఆదాయం పొందాడానికి అవకాశం ఉంటుంది. రెండు మొక్కజొన్న చాళ్ళ మధ్య ఒక చాలు కంది పంటను లేదా 6 చాళ్ళ వేరుశనగాను లేదా 7 చాళ్ళ పెసర / మినుము / బొబ్బర్లు / సోయా చిక్కుడు పంటలను వేసుకున్నచో రైతుకు లాభదాయకంగా ఉంటుంది వరుసక్రమ పంటగా పప్పుజాతికి చెందిన పంటలు ముఖ్యంగా వేరుశంగను రబీలో విత్తుకోవడం వలన తదుపరి విత్తే ఖరీఫ్ మొక్కజోన్నకు భూమిలో స్దిరికరిం చిన నత్రజని లభ్యమై రసాయనిక ఎరువుల వాడకం తగ్గుతుంది
మొక్కజోన్నకు పుతకు ముందు, పూత దశలో మరియు గింజ పాలు పోసుకునే దశలో బాగా నీరు పెట్టడం అవసరం. 30-40 రోజులలోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం. విత్తిన తర్వాత చేలో నీరు నిలుస్తే విత్తనం మొలకేత్తదు. సాధారణంగా పంట కాలంలో 6-8 నీటి తడులు అవసరం. విత్తేటప్పుడు. విత్తిన 15 రోజులకు, 30-35 రోజులకు, పుతదశలో, పూత వచ్చిన 15 రోజులకు మరియు గింజ పాలు పోసుకునే దశలో నీటి తడులను తప్పకుండ ఇవ్వాలి. దీర్ఘ కాలిక వంగడాలకు 1-2 తడులు అధికంగా అవసరమౌతాయి. ముఖ్యంగా ఉదయం వేళలో ఆకులు చుట్ట చుట్టుకున్నట్లు కనిపిస్తే నటి ఆవశ్యకత ఉన్నట్లుగా గమనించి నీటి తడి ఇవ్వాలి.
టర్సికమ్ ఆకు ఎండు తెగులు : ఆకులపై పొడవైన, కోలాకారపు బూడిద రంగుతో కూడిన ఆకుపచ్చ లేక గోధుమ వర్ణపు మచ్చలు కన్పిస్తాయి. ఈ మచ్చలు 2.5 నుండి 25 సెం.మీ. పొడవు మరియు 4 సెం.మీ. వెడల్పు ఉంటాయి. ఈ మచ్చలు మొు దట మొక్క క్రింది ఆకులపై అగుపించి, పెద్దవై పై ఆకులకు కూడా వ్యాపిస్తాయి. అధిక తేమతో కూడిన వాతావరణంలో ఆకు అంతా ఎండి మొక్కలు చనిపోయినట్లుగా అగుపిస్తాయి. శిలీంధ్ర బీజాలు ఆకుల అడుగు భాగాన వలయాలుగా అగుపిస్తాయి. ఈ మచ్చలు కండెపై ఉన్న పొట్టుపై కూడా వ్యాపిస్తాయి.
ఇవి రెండు రకాలు. మచ్చల లేక చారల కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఖరిఫ్ పైరును ఆశిస్తుంది గులాబి రంగు కాడం తొలుచు పురుగు ఎక్కువగా రబీ మొక్కజొన్నను ఆశిస్తుంది. ఇవి పైరు మొలకెత్తిన 10-20 రోజులకు ఆశిస్తాయి. పిల్ల పురుగులు మొదట అకుల పైన పత్ర హరితాన్ని గోకి తింటాయి. తర్వాత ముడుచుకొని ఉన్న అకుద్వారా కాండం లోపలికి చేరతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తర్వాత గుండు సూది మాదిరి రంధ్రాలు లేదా పొడవాటి చిల్లులు వరుస క్రమంలో కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినాడం వలన మొవ్వు చనిపోయి, ఎండిపోతుంది. దీనినే డేడ్ హార్ట్ అంటారు. కాడం లోపల గుండ్రని లేదా “s” ఆకారంలో సోరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను మరియు కంకిని ఆశించడం వలన దిగుబడి తగ్గిపోతుంది.
ముప్ఫై రోజులు పైబడిన పైరును పెనుబంక మరియు చిగురు నల్లి ఆశించవచ్చు. పొడి వాతావరణంలో వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తల్లి పురుగులు ఆకులు మరియు లేత కాండం నుండి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగుకు మారిపోతాయి. మొక్క గిడసబారి పోతుంది. ఇవి విసర్జించే తేనే లాంటి జిగురు పదార్ధానికి చీమలు చేరడమే కాకుండా శిలింధ్రాలు ఏర్పడి మసి తెగులు ఆశించడం వలన కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం ఏర్పడి దిగుబడి తగ్గుతుంది.
సహజంగా అక్షింతలు పురుగులు, సిర్ఫిడ్స్ వంటి పరాన్నభుక్కులు మరియు పరాన్నజీవులు ఈ పురుగులను అదుపులో ఉంచుతాయి. రసం పిల్చు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటె మొనోక్రోటోఫాస్ ఎకరాకు 320 మి.లీ లేదా డైమిధోయేట్ 400 మి.లీ 200 లిటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
ఆకుల పై పొడవైన, కోలాకారపు బూడిద రంగుతో కూడిన ఆకుపచ్చ లేక గోధుమ వర్ణపు మచ్చులు కన్పిస్తాయి. ఈ మచ్చలు 2.5 నుండి 25 సెం.మి పొడవు మరియు 4 సెంమీ. వెడల్పు ఉంటాయి. ఈ మచ్చలు మొదట మొక్క క్రింది ఆకుల పై అగుపించి, పెద్దవై పై ఆకులకు కూడా వ్యాపిస్తాయి. అధిక తేమతో కూడిన వాతావరంలో ఆకు అంతా ఎండి మొక్కలు చనిపాయినట్లుగా అగుపిస్తాయి. శిలింధ్ర బీజాలు ఆకుల అడుగు భాగాన వలయాలుగా అగుపిస్తాయి. ఈ మచ్చలు కండెపై ఉన్న పొట్టు పై కూడా వ్యాపిస్తాయి.
ఆకుల పై రెండువైపులా గుండ్రని లేక పొడవాటి గోధుమ వర్ణపు పొక్కుల మాదిరిగా తెగులు లక్షణాలు కనిపిస్తాయి. పంట పెరిగిన కొలది ఆకుల పైన పొక్కులు గోధుమ వర్ణం నలుపు వర్ణానికి మారుతాయి. పూత సమయంలో తెగులు లణాలు స్పష్టంగా అగుపిస్తాయి. అధిక తేమ గల చల్లని వాతావరణంలో తెగులు ఉధృతి మరియు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.
పై రెండు రకాల తెగుళ్ళ నివారణకు మాంకోజేబ్ ఎకరాకు 500 గ్రా. 200 లీటర్ల నీటికి కలిపి తెగులు త్రివ్రతను బట్టి ఒకటి లేక రెండుసార్లు పిచికారీ చేసి సమర్ధవంతంగా అరికటవచ్చు. విత్తేముందు కిలో విత్తనానికి 2.5 గ్రా. మాంకోజేబ్ శిలింద్రాశినితో విత్తనశుద్ది చేసి విత్తుకోవాలి.
పూత దశ తరువాత నేలలో తేమ శాతం తాగడం వలన వాతావరణంలో ఉషోనోగ్రత పెరగడం వలన ఈ తెగులు ఎక్కువ తీవ్రతతో సోకుతుంది. నేలలోని శిలింధ్రం మొక్కల వేర్లద్వారా కాడం పైభాగానికి వ్యాపిస్తుంది. కాండం పై గోధుమ రంగు చారలు ఏర్పడతాయి. ఈ తెగులు వలన పంట కోత దశకు రాకముందే కాండం భాగం విరిగి మొక్కలు నేల పై పడిపోతాయి. ఇటువంటి మొక్కలను చీల్చి చూసినప్పుడు లోపల బెండు భాగం కుళ్ళి, తెలుపు రంగు నుండి నలుపు రంగుకు మారడం గమనించవచ్చు.
తెగులు ఎక్కువగా సోకే ప్రాంతాలలో పంటవేసే ముందు పచ్చిరోట్ట పైరును సాగుచేసి నేలలో కలియదున్నాలి. టైకోడర్మా శిలింధ్రాన్ని పశువుల ఎరువులో వ్రుద్ధిచేసి 3-4 సంవత్సరాలు వరుసగా నేలలో కలుపుతూ పోవాలి. ఎకరాకు అదనంగా 30 కిలోల పోటాష్ ను ఇచ్చు ఎరువులను వేయాలి. ఎండాకాలంలో నేలను లోతుగా దున్నాలి. పంట వేసిన తరువాత ముఖ్యంగా పుతదశ నుండి నేలలో తేమ తగ్గకుండా ఉండేవిధంగా నీటి తడులు పెట్టాలి. పంటకోసిన తరువాత తెగలు సోకిన మొక్కల భాగాలను ఏరి కాల్చివేయాలి. పంటమార్పిడి పధ్ధతి అవలంభించాలి.
ఈ తెగులు ముందుగా నెలకు దగ్గరగా ఉండే మొక్కల క్రింది ఆకుల పై ఒకదాని తరువాత ఒకటి ఏర్పడి చూడటానికి పాముపోడ మాదిరిగా అగుపిస్తాయి. కాండం పై ఏర్పడిన తెగులు లక్షణాలు వలన కణుపుల వద్ద మొక్కలు విరిగి నేల పై పడిపోతాయి. తెగులును కలుగుజేసే శిలింధ్రం మొక్కల అవశేషాలలో మరియు కలుపు మొక్కల పై జీవించి ఉంటుంది.: ఈ తెగులు ముందుగా నెలకు దగ్గరగా ఉండే మొక్కల క్రింది ఆకుల పై ఒకదాని తరువాత ఒకటి ఏర్పడి చూడటానికి పాముపోడ మాదిరిగా అగుపిస్తాయి. కాండం పై ఏర్పడిన తెగులు లక్షణాలు వలన కణుపుల వద్ద మొక్కలు విరిగి నేల పై పడిపోతాయి. తెగులును కలుగుజేసే శిలింధ్రం మొక్కల అవశేషాలలో మరియు కలుపు మొక్కల పై జీవించి ఉంటుంది. ఈ తెగులు ముందుగా నెలకు దగ్గరగా ఉండే మొక్కల క్రింది ఆకుల పై ఒకదాని తరువాత ఒకటి ఏర్పడి చూడటానికి పాముపోడ మాదిరిగా అగుపిస్తాయి. కాండం పై ఏర్పడిన తెగులు లక్షణాలు వలన కణుపుల వద్ద మొక్కలు విరిగి నేల పై పడిపోతాయి. తెగులును కలుగుజేసే శిలింధ్రం మొక్కల అవశేషాలలో మరియు కలుపు మొక్కల పై జీవించి ఉంటుంది.
తెగులు నివారణకు నెలకు దగ్గరగా ఉన్న తెగులు సోకిన ఒకటి లేక రెండు అకులను తీసివేయాలి. 200 గ్రా. కార్బెండ జిమ్ లేక 200 మి.లీ ప్రోపికోనజోల్ మందు 200 లీటర్లు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రతి సంవత్సరం ఈ తెగులు ఆశించే ప్రాంతాలలో విత్తిన 40 రోజుల తర్వాత తెగులు సోకకముందే ఈ మందులు పిచికారీ చేయాలి.
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/5/2024