జైళ్ళ అధికారిక సందర్శకులలో సెషన్స్ జడ్జి చాలా ముఖ్యమైన వ్యక్తి. నేరస్తులంతా కోర్టు ఉత్తర్వుల ద్వారనే జైలుకు పంపబడతారు. కాబట్టి, ఖైదీల బాగోగులు చూడవలసిన బాధ్యత జడ్జీలపై మరింత ఎక్కువ ఉంటుంది. అర్హులను బెయిల్ పై విడుదల చేయడం ద్వారానూ, పరిశోధనను వేగవంతం చేయమని ఆజ్ఞాపించడం ద్వారానూ – జడ్జీ జైళ్ళలోని రద్దీ సమస్యను చాలావరకు తగ్గించవచ్చు. మొత్తం ఖైదీలలో 75% విచారణ కొరకు ఎదురుచూస్తున్న వారే కనక వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు జైళ్ళ పరిస్థితి మెరుగుకావడం అసాధ్యం. నిజానికి సందర్శకుల బోర్డుకి సెషన్స్ జడ్జీ ఛైర్ పర్సన్ గా ఉండాలని కూడా ముల్లా కమిటీ సిఫారసు చేసింది. ఊచల వెనుక ఉన్న మనుషులను మరిచిపోవడం వలన ఎటువంటి అనర్థాలు జరుగు తాయో అజయ్ ఘోష్ కథ మనకు విశదపరుస్తుంది. 1962 లో సోదరుణ్ణి చంపిన కేసులో అజయ్ ఘోష్ అరెస్టు అయ్యాడు. ఆ తరువాత అతను మానసిక రోగి అని గుర్తించి, విచారణకు అనర్హుడని తేల్చారు. అతన్ని ఏ రోజూ కోర్టుకు తీసుకు రాకపోగా 1968లో వాళ్ళ్ అమ్మ చనిపోయాక అతన్నికలవడాని కూడా ఎవరూ జైలుకు రాలేదు. అతడు కలకత్తాలోని ప్రెసిడెన్సీ జైల్లో 37 సంవత్సరాలు అలాగే ఉండిపోయాడు. ఈ కాలంలో కేసులోని సాక్షులు, కేసును విచారించే జడ్జి సైతం మరిణించారు. అయినా అతను అలాగే ఏ నివారణకు నోచుకోకుండా జైలులోనే గడిపాడు. 1995లో కలకత్తా హైకోర్టు అజయ్ ఘోష్ ను మానసిక చికిత్సా కేంద్రానికి పంపమని ఉత్తర్వు జారీ చేసినా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వందాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత అతనికి చూపు మందగి6చింది, మాట్లాడటం కూడా మరచిపోయాడు. చివరకు. 1999 నవంబర్ లో ఈ కేసు భారత ప్రధాన న్యాయమూర్తి ఎ.ఎస్ . ఆనంద్ గారి దృష్టికి వచ్చింది. అప్పుడు ఆనంద్ గారు – అజయ్ ఘోష్ ను కలకత్తాలోని ఒక ధార్మిక మిషనరీ నడుపుతున్న మానసిక చికిత్సాకేంద్రానికి బదిలీ చేయమని ఉత్తర్వు జారీ చేయడమే కాకుండా, అతని వైద్యావసరాలకు 2 లక్షల పరిహారం ఆ చికిత్సా కేంద్రానిఇ చెల్లించమని కూడా చెప్పారు. సెషన్స్ జడ్జీలను తరచూ జైళ్ళకు రప్పించగలిగితే అజయ్ ఘోష్ లాంటి విషాద సంఘటనలు పునరావృతం కాకుండా చూఉకోవచ్చు. సెషన్స్ జడ్జిలతో ఎలా వ్యవహరించాలి జైలును సెషన్స్ జడ్జి సందర్శిస్తున్నారా లేదా అని ముందుగా తెలుసుకోవాలి. సందర్శించని పక్షం లో అనధికార సందర్శకుల బృందం వారిని వెళ్ళి కలవాలి. కలిసి విచారణ ఖైదీల కేసుల్లో జరుగుతున్నజాప్యం గురించి, జైల్లో న్యాయ సహాయం అందక పోవడం తదితర సమస్యల గురించి వివరించి చెప్పాలి. జడ్జిని కలవకముందే, సూపరింటెండెంట్ ని కలిసి ఏ సమస్యలు మాట్లాడాలో ఏ విధంగా మాట్లాడా లో చర్చించాలి. జడ్జిని వారికి వీలైన రోజున జైలుకు ఆహ్వానించాలి. ఆ రోజు వారి సమస్యల గురించి వారే మాట్లాడే విధంగా ఖైదీలను సంసిద్ధం చేయాలి. ఈ కార్యక్రమానికి ముందుగానే సూపరింటెండేంట్ ని సంప్రదించి ఏయే సమస్యలు ప్రస్తావించాలను కుంటున్నామో వారితో చర్చించాలి. ఖైదీలందరినీ కోర్టుల వారీగా లైన్లలో నిలబడమని చెప్పడం వలన జడ్జికి చూడగానే ఏ కోర్టులో ఎక్కువ కేసులు పెండింగ్ లో ఉన్నయో తెలుస్తుంది. అప్పుడు ఆ కోర్టు న్యాయమూర్తితో మాట్లాడి తగు చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. బెయిల్ పొందడానికి అర్హమైన కేసులను ప్రత్యేకంగా సెషన్స్ జడ్జి దృష్టికి తీసుకుపోవడం వలన వారికి సులభంగా బెయిల్ వచ్చే ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. ఇవికాక ఇతర చట్ట సంబంధమైన సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళండి. ఆయన సకాలంలో జోక్యం చేసుకొవడం వలన ఒనగూడే ప్రయోజనాల గురించి కూడా వివరించండి. జాతీయ మానవ హక్కుల కమీషన్ మాజీ ఛైర్మన్ అయిన జె.ఎస్ వర్మ అన్ని రాష్ట్రాల హైకోర్టు లకు రాసిన ఉత్తరాన్ని వారి దృష్టికి తీసికెళ్ళండి. ఆయన అందులో సెషన్స్ జడ్జీలకు ఉన్న అనేక బాధ్యతల్లో జైళ్ళను సందర్శించడం కూడా ఒకటని, దీన్ని సెషన్స్ జడ్జీలు పాటించేలా హై కోర్టు లు చొరవ చూపాలని కోరారు. మీ ప్రాంతంలోని సెషన్స్ జడ్జీకి హైకోర్టు నుంచి అలాంటి సూచన వచ్చిందో లేదో హైకోర్టు సిజిష్ట్రీలో తెలుసుకుని, రాని పక్షంలో జె.ఎస్.వర్మ. ఉత్తరం కాపీ ఒకటి మీరు తీసికెళ్ళి సెషన్స్ జడ్జీకి ఇవ్వోచ్చు. (జె.ఎస్ వర్మ ఉత్తరం అనుబంధంలో చూడండి.) ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్