సూర్యుడిపై తొలి మిషన్ను ప్రారంభించేందుకు ఇస్రో సిద్ధం
చంద్రయాన్ మిషన్ విజయవంతం అయిన స్వల్ప కాలంలోనే, భారత్ సూర్యుడిపై తన తొలి మిషన్ ఆదిత్య - ఎల్2తో సిద్దంగా ఉందని, దానిని ప్రయోగించేందుకు ఇస్రో సంసిద్ధంగా ఉందని, బహుశ అది 2 సెప్టెంబర్ నాడు జరగవచ్చని కేంద్ర శాస్త్ర& సాంకేతిక శాఖ సహాయమంత్రి (ఇండిపెండెంట్ ఛార్జి), పిఎంఒ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.